డ్రగ్స్ తో పట్టుబడిన బీటెక్ విద్యార్థి

by Kalyani |
డ్రగ్స్ తో పట్టుబడిన బీటెక్ విద్యార్థి
X

దిశ, ఎల్బీనగర్ : ఉన్నత చదువుల కోసం ఆంధ్రా నుంచి హైదరాబాద్ కు వచ్చి డ్రగ్స్ తో పట్టుబడిన యువకుడి పై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీటెక్ చదువుతున్న విద్యార్థి చెడు వ్యసనాలకు బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో డ్రగ్స్ విక్రయానికి పాల్పడుతూ… ఎక్సైజ్ పోలీసులకు చిక్కి కటకటాల పాలై తన జీవితాన్ని బుగ్గిపాలు చేసుకున్నాడు. వనస్థలిపురం సుష్మ థియేటర్ పరిసర ప్రాంతాలలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయని ఎక్సైజ్ ఎస్ టి ఎఫ్ టీం కు సమాచారం అందంతో సోమవారం వనస్థలిపురం సుష్మ పరిసర ప్రాంతాలలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు చెందిన కట్ట మంచి జాన్ నుంచి 2500 గ్రాముల ఎండి ఎం ఏను ఆంధ్రప్రదేశ్ నుంచి నగరానికి తీసుకువచ్చి వనస్థలిపురం పరిసర ప్రాంతాల్లో రూ. 5000 విక్రయిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు . అంతేకాకుండా అతని ద్విచక్ర వాహనాన్ని, చరవాణిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed