HYD : షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో భారీ చోరీ

by Rajesh |
HYD : షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో భారీ చోరీ
X

దిశ, వెబ్‌డెస్క్: షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి మూడ బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. అయితే చోరీ జరిగినట్లు ప్రయాణికులు మహారాష్ట్ర లాతూరు వద్ద గుర్తించారు. మూడు బోగీల్లో ఏపీకి చెందిన ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కాగా, బాధితులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పిర్యాదు చేశారు. బంగారు నగలు, డైమండ్ రింగ్స్, ఫోన్లు పోయినట్లు బాధితులు తెలిపారు. దాదాపు రూ.25 లక్షల విలువైన బంగారం, ఫోన్లను దుండగులు అపహరించారు. చోరీ ఘటనపై తెలంగాణ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More..

road accident : రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి



Next Story