HYD : ఘనంగా లాల్ దర్వాజా బోనాలు

by Rajesh |
HYD : ఘనంగా లాల్ దర్వాజా బోనాలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో లాల్ దర్వాజా బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి కోసం ప్రత్యేక ఘట్టం ఏర్పాటు చేశారు. తెల్లవారు జాము నుంచి భక్తులు అమ్మవారికి మొక్కులను చెల్లించుకుంటున్నారు. మహంకాళి అమ్మవారికి బోనాలను భక్తులు సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజా ఆలయం దగ్గర ఐదు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. బోనాలు తెచ్చే మహిళలకు 2 ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. నేడు అమ్మవారి శాంతి కల్యాణం నిర్వహిస్తున్నారు. 23 ప్రధాన ఆలయాల్లో బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది. రేపు రంగం, అమ్మవారి ఘటాల ఊరేగింపు నిర్వహించనున్నారు. బోనాల సందర్భంగా పలు ఆలయాల్లో భక్తుల కోసం అన్నదానలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాలన్నింటిని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు.

Advertisement

Next Story