కేసీఆర్ కరీంనగర్‌ పర్యటనలో దొంగల హల్‌చల్.. ఎన్ని వేలు కొట్టేశారో తెలుసా?

by GSrikanth |
కేసీఆర్ కరీంనగర్‌ పర్యటనలో దొంగల హల్‌చల్.. ఎన్ని వేలు కొట్టేశారో తెలుసా?
X

దిశ, బ్యూరో కరీంనగర్: బీఆర్ఎస్ కార్యక్రమం అంటే చాలు దొంగలకు పండగ అయిపోయింది. ఎక్కడ పార్టీ కార్యక్రమం ఉన్నా అక్కడ వాలిపోయి బీఆర్ఎస్ నేతల జేబులకు చిల్లు పెట్టేస్తున్నారు. తాజాగా.. కరీంనగర్‌ జిల్లా రూరల్‌ మండలం ముగ్ధుంపూర్‌లో ఎండిపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, రైతులతో పాటు సుమారు పదిమంది దొంగలు కూడా హాజరయ్యారు. బీఆర్ఎస్ నేతల జేబులకు చిల్లు పెట్టి ఏకంగా రూ.70 వేల వరకు కొట్టేసినట్లు సమాచారం. ఓ బీఆర్ఎస్ నేత తమ జేబులో నుండి పదివేల రూపాయలు కోట్టేస్తుంటే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చితకబాదారు. అతని నుంచి రూ.10 వేలు స్వాధీనం చేసుకొని పోలీసులను అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed