‘గాంధీ’ వివాదం.. బీఆర్ఎస్ వైద్య కమిటీ సభ్యుల హౌజ్ అరెస్ట్! ఎక్స్‌లో పార్టీ వెల్లడి

by Ramesh N |
‘గాంధీ’ వివాదం.. బీఆర్ఎస్ వైద్య కమిటీ సభ్యుల హౌజ్ అరెస్ట్! ఎక్స్‌లో పార్టీ వెల్లడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితులు దిగజారుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు గాంధీ ఆస్పత్రిలో జరుగుతున్న మరణాల విషయంలో అధ్యయనం చేయడానికి ఆసుపత్రికి బయల్దేరక ముందే వైద్య కమిటీ సభ్యులని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారని ఎక్స్ వేదికగా వెల్లడించింది. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య సేవల విషయంలో అధ్యయనం చేసేందుకు, ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చేందుకు బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ముగ్గురు డాక్టర్లతో కూడిన బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించింది. ఇప్పటికే కమిటీ అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఇండ్ల వద్దకు పోలీసులు చేరుకున్నారని ప్రకటించింది.

ముగ్గురు నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసుల ప్రయత్నం చేస్తున్నారని తెలిపింది. ఆసుపత్రుల సందర్శనకు వెళ్లి పరిస్థితులను పరిశీలిస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. రాజకీయాల కోసం కాకుండా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు నిపుణులైన డాక్టర్లుగా తాము గాంధీ ఆసుపత్రికి వెళ్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని కమిటీలోని నాయకులు ప్రశ్నించారు. గాంధీ ఆసుపత్రిలో మా పార్టీ ప్రస్తావించిన మాతా శిశు మరణాల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతుందా ? లేదా తమ పరిపాలన వైఫల్యం బయటకు వస్తుందని భయపడుతుందని నాయకులు తెలిపారు. పోలీసులు తమ ఇండ్ల నుంచి వెంటనే వెళ్లిపోవాలని నాయకులు కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి పిరికిపంద చర్యలను ఆపాలని ఆగ్రహం వక్తం చేశారు. ఈ మేరకు ఈ విషయాలను సోమవారం ఎక్స్‌లో బీఆర్ఎస్ పార్టీ షేర్ చేసింది. కాగా, గాంధీ ఆస్పత్రిలో ఒకే నెలలో 48 మంది శిశువులు, 14 మంది బాలింతలు చనిపోయారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. దీంతో ఇది వివాదంగా మారింది.

Next Story

Most Viewed