తప్పుతేలితే.. KCR శిక్ష అనుభవించాల్సిందే: విప్ ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |
తప్పుతేలితే.. KCR శిక్ష అనుభవించాల్సిందే: విప్ ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు కోసం హైకోర్టుకు వెళ్లిన మాజీ సీఎం కేసీఆర్‌కు చుక్కెదురైందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు. సోమవారం ఆయన అసెంబ్లీ సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేయడం కేసీఆర్‌కు చెంప పెట్టులాంటిందన్నారు. చంద్రశేఖర్ రావు వాస్తవాలను దాచి పెట్టాలనుకునే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అని పేర్కొన్నారు. రాజ్యాంగబద్దంగా ఏర్పాటు చేసిన కమిషన్‌ను రద్దు చేయాలనే సాహసం చేస్తున్నాడని విమర్శించారు.

చంద్రశేఖర్ రావు‌కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరై వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ఉన్నదన్నారు. పదేళ్లలో తుగ్లక్ నిర్ణయాలు తీసుకోవడం వలనే రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. కమిషన్ విచారణలో తప్పుతేలితే, కేసీఆర్ శిక్ష అనుభవించాల్సిందేనని వెల్లడించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విసిరిన సవాల్ పైనే ప్రభుత్వం విచారణ జరుపుతోందన్నారు. ఏ విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరి పారిపోతారా..? అంటూ ఎద్దేవా చేశారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌లో పిడుగులు పడకుండా టెక్నాలజీ ఎందుకు ఏర్పాటు చేయలేదు..? అని మండిపడ్డారు.

Next Story