శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ కోటా ప్రత్యేక దర్శన టికెట్ల కోటా విడుదల డేట్ ఫిక్స్

by Rajesh |
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ కోటా ప్రత్యేక దర్శన టికెట్ల కోటా విడుదల డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్జిత సేవా టికెట్ల కోటా డేట్‌ను తితిదే అనౌన్స్ చేసింది. ఈ నెల ఉదయం 10 గంటలకు ఆన్ లైన్‌లో ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. ఆర్జిత సేవా టికెట్లు, ఆన్ లైన్ లక్కీడిప్ కోసం ఈ నెల 20 ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈ నెల 24 వ తేదీన ఉదయం 10 గంటలకు అక్టోబర్‌కు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను విడుదల చేస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల, తిరుపతిలలో అద్దె గదుల బుకింగ్ కోటా విడుదల కానుంది.



Next Story