KTR: చెత్త తరలింపు కేవలం కాగితాల్లో మాత్రమే కనిపిస్తుంది..

by Aamani |
KTR: చెత్త తరలింపు కేవలం కాగితాల్లో మాత్రమే కనిపిస్తుంది..
X

దిశ,వెబ్ డెస్క్: భారీ వర్షాల కారణంగా నీటి నిల్వతో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. వాటిపై కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయని,సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదని, బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని, డెంగీ, మలేరియా, అతిసారం వంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలుపడుతున్నారని అన్నారు. అంతే కాకుండా చెత్త తరలింపు కేవలం కాగితాల్లో మాత్రమే కనిపిస్తోందని అధికారుల ఆకస్మిక పర్యటనలు లేకపోవడంతో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి పౌరుల ఆరోగ్యాలు కాపాడాలని కేటీఆర్ ట్వీట్ వేదికగా తెలిపారు. పర్యవేక్షించాల్సిన పార్ట్-టైం మున్సిపల్ మంత్రేమో ఎమ్మెల్యేల కొనుగోళ్లు, ఢిల్లీ చక్కర్లలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.



Next Story

Most Viewed