- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
'ఉద్యమంలో నువ్వు ఇచ్చిన హామీ నిలబెట్టుకో'.. కేసీఆర్పై మాజీ మంత్రి ఈటల ఫైర్
దిశ సిటీ బ్యూరో : తెలంగాణ ఉద్యమంలో భాగంగా జీహెచ్ఎంసీ అవుట్ సోర్స్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని నీవు ఇచ్చిన హామీని నిలబెట్టుకో అంటూమాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పేదల డబ్బులతో పేదల కోసం కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వాళ్ళకు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీనగర్లో సమ్మె చేపట్టిన కార్మికులను ఆయన కలిశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటల మాట్లాడుతూ.. అధికారం ఉంది కదా అని పేదలపై పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్నావని, ఇంకో రెండు నెలలు అయితే నీ ఉద్యోగం పీకేస్తామని అన్నారు. ఏమాత్రం చిత్తశుద్ధి నైతిక విలువలు ఉన్నా జీహెచ్ఎంసీ ఔట్సోర్స్ కార్మికులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని వెంటనే ప్రత్యేక ఆదేశాలతో వారిని పెర్మనెంట్ చేయాలన్నారు. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని అన్నారు. కార్మికులను కలిసిన వారిలో మాజీ మంత్రితో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ఊదరి గోపాల్ కూడా ఉన్నారు.