ఏపీ సీఎస్ కు రిపోర్ట్ చేసిన ఐఏఎస్ లు

by Y.Nagarani |
ఏపీ సీఎస్ కు రిపోర్ట్ చేసిన ఐఏఎస్ లు
X

దిశ, వెబ్ డెస్క్: డీఓపీటీ ఆదేశాల మేరకు నలుగురు ఐఏఎస్ అధికారులు ఏపీలో రిపోర్ట్ చేశారు. అమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణిప్రసాద్ లు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ను కలిసి రిపోర్టు చేశారు. బుధవారం సాయంత్రం వీరంతా తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యారు. డీఓపీటీ ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హై కోర్టు నిరాకరించడంతో ఏపీకి వచ్చి రిపోర్టు చేశారు.

ఏపీ నుంచి ముగ్గురు ఐఏఎస్ అధికారులు రిలీవ్ అయ్యి.. తెలంగాణలో రిపోర్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గమ్మళ్ల సృజన, లోతేటి శివశంకర్, హరికిరణ్ లు హైదరాబాద్ లో రిపోర్ట్ చేశారు. కాగా.. ఐఏఎస్ లు దాఖలు చేసిన పిటిషన్లపై నవంబర్ లో విచారణ జరగనుంది. విచారణ అనంతరం ఐఏఎస్ ల అభ్యంతరాలపై తుది ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Advertisement

Next Story