మందుపాతర పేలి ఐదుగురు జవాన్లకు గాయాలు

by Mahesh |
మందుపాతర పేలి ఐదుగురు జవాన్లకు గాయాలు
X

దిశ, భద్రాచలం: మందుపాతర పేలి ఐదుగురు జవాన్లకు గాయాలైన ఘటన ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఊసూరు బ్లాక్ తర్రెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండం అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ 153 బెటాలియన్ కి చెందిన జవాన్లు కూంబింగ్‌కు బయలుదేరారు.సెర్చింగ్ ఆపరేషన్ నడుస్తున్న సమయంలో మాటు వేసిన మావోయిస్టులు పోలీసులను లక్ష్యంగా చేసుకొని మందుపాతర పేల్చారు. దీంతో ఒక ఇన్స్పెక్టర్‌తో సహా 5 గురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ జవాన్లను హెలికాప్టర్‌లో రాయపూర్ హాస్పటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed