సాగర్ ప్రధాన రహదారిపై ఘోర ప్రమాదం

by Mahesh |
సాగర్ ప్రధాన రహదారిపై ఘోర ప్రమాదం
X

దిశ, కొండమల్లేపల్లి: నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండమల్లేపల్లి మండలం చెన్నారం గేటు వద్ద బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి చీరాల వైపు వెళ్తున్న కారు స్టేజి వద్ద బుగ్గ తండా వైపు ద్విచక్ర వాహనం పై తన అన్న కొడుకుతో వెళ్తుండగా అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు భీముడు (23) సంవత్సరాలు వెంకటేశు (8) సంవత్సరాలు మృతులు నేరేడు కొమ్ము మండలం బుగ్గ తండా గ్రామానికి చెందినవారుగా బంధువులు గుర్తించారు. మృతులు ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. పోలీసులు సంఘటనలకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed