ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర రెక్కీ.. పోలీసుల అదుపులో నిందితులు

by karthikeya |
ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర రెక్కీ.. పోలీసుల అదుపులో నిందితులు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఆదివారం నాడు గోషామహాల్‌లోని ఎమ్మెల్యే ఇంటి వద్ద షేక్ ఇస్మాయిల్, షేక్ ఖాజా అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని స్థానికులు పట్టుకుని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వాళ్లు ఎమ్మెల్యే ఇంటిపై రెక్కీ నిర్వహించేందుకు వచ్చినట్లు తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటిక అక్కడకు చేరుకున్న మంగళ్ హాట్ పోలీసులు నిందితులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. ఇద్దరి మొబైల్ ఫోన్లలో రాజాసింగ్ ఫోటోలు, గన్‌, బుల్లెట్ల ఫోటోలు ఉండడంతో రాజాసింగ్‌పై దాడి చేయడానికి వచ్చారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed