- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
డయాలసిస్కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకులు మృతి
దిశ, భీంగల్ : తండ్రి వైద్యం కోసం బైక్పై వెళ్తూ శివరాత్రి పర్వదినాన బైక్తో నిలిచి ఉన్న లారీకి డీకొట్టి తండ్రి కొడుకులు శివైక్యమైన సంఘటన అందరి కలిచివేసింది. వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పడిగేలా గేట్, అంక్సాపూర్ గ్రామాల మధ్యన జరిగిన హృదవిధారక సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామానికి చెందిన మాడవేడి రవీందర్(55) గత రెండు సంవత్సరాలు క్రితం బయటి దేశం నుండి కిడ్నీలు ఫెయిల్ అవడంతో ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పడి నుండి డయాలసిస్ చేయిస్తున్నారు. ఈ క్రమంలో కొడుకు మాడవేడి రాజు (22)శుక్రవారం ఉదయం వేకువజామున 5.30గంటలకే తన తండ్రిని బైక్పై ఎక్కించుకొని డయాలసిస్ కోసం ఇంటి నుండి బయలుదేరారు. ఇంటి నుండి పదినిమిషాలు ప్రయాణించారో లేదో చెడిపోయి రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన లారీకి డీ కొట్టుకొని అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. ఘటన సమాచారం అందుకొన్న ఎస్సై వినయ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.