- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఈటల భేటీ
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని శుక్రవారం మల్కాజ్ గిరి ఎంపీ ఈటల కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న సమస్యలను ఈటల గడ్కరీకి వివరించారు. అనంతరం మీడియాతో ఈటల మాట్లాడుతూ.. కొంపల్లిలో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్, నత్తనడక నడుస్తున్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, శామీర్ పేట రోడ్డు, Lb నగర్ అండర్ పాస్, హుజూరాబాద్ రోడ్డు సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. హైదరాబాద్లో అన్నీ అండర్ పాస్లు కాకుండా ఫ్లై ఓవర్ లు నిర్మించాలని కోరినట్లు పేర్కొన్నారు. హుజూరాబాద్లో సింగాపూర్, రాంపూర్, రంగాపూర్, పెద్దపాపాయపల్లిలో రైతులకు ఇబ్బంది లేకుండా సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయాలని కోరామన్నారు. నితిన్ గడ్కరీ త్వరలో సమగ్రంగా మరో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఈటల స్పష్టం చేశారు.
Advertisement
Next Story