నేడు అమిత్ షాతో ఈటల భేటీ.. స్టేట్ చీఫ్‌గా ప్రకటించే ఛాన్స్!

by Rajesh |   ( Updated:2024-06-10 03:00:01.0  )
నేడు అమిత్ షాతో ఈటల భేటీ.. స్టేట్ చీఫ్‌గా ప్రకటించే ఛాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: మల్కాజ్ గిరి నుంచి రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచిన ఈటలకు బీజేపీ హై కమాండ్ స్టేట్ చీఫ్ పోస్ట్ ఇవ్వడానికి రెడీ అయినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, నేడు అమిత్ షాతో ఈటల భేటీ కానున్నారు. వీరి భేటీ అనంతరం ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈటల తొలుత కేంద్ర మంత్రి పదవి ఆశించగా.. వచ్చే స్థానిక సంస్థల లక్ష్యంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈటలకు ఉన్న గుర్తింపు పార్టీ బలోపేతానికి కలిసొస్తుందని కాషాయ పార్టీ భావిస్తోంది. కేబినెట్ మంత్రిగా, తెలంగాణ ఉద్యమ కారుడిగా ఆయనకు విస్తృత సంబంధాలు ఉన్నాయి. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటలను నియమించే విషయంలో నేడు క్లారిటీ రానుంది.

Advertisement

Next Story

Most Viewed