CEC Rajeev Kumar: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కు తప్పిన పెను ప్రమాదం

by Prasad Jukanti |
CEC Rajeev Kumar: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కు తప్పిన పెను  ప్రమాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం ఆయన మిలాంకు వెళ్తుండగా ఉత్తరాఖండ్ లోని పితోర్ గఢ్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతమైన రాలంలో ప్రతికూల వాతావరణం కారణంగా అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్ లో రాజీవ్ కుమార్ తో పాటు ఉత్తరాఖండ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విజయ్ కుమార్ జోగ్దాండే కూడా హెలికాప్టర్‌లో ఉన్నారు. ఇద్దరు అధికారులతో పాటు పైటల్ క్షేమంగా ఉన్నారని, ఎలాంటి గాయాలు కాలేదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story