నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

by Rajesh |
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
X

దిశ, కార్వాన్ : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో శనివారం ఉదయం చేపమందు ప్రసాదం ప్రారంభమైంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం శ్యాం ప్రసాద్, దానం నాగేందర్, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మి లతో కలిసి కార్యక్రమాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభించారు. 36 గంటల పాటు కొనసాగనున్న చేప ప్రసాద పంపిణీ చేప ప్రసాదాన్ని దివంగత బత్తిన హరినాథ్ గౌడ్ కుమారుడు అమర్నాథ్ గౌడ్, సోదరుడు గౌరీ శంకర్లు పంపిణీ చేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు చేప మందును వేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 150 సంవత్సరాలుగా చేప మందు పంపిణీ జరుగుతుందన్నారు. చాలా కాలంగా చేప మందు పంపిణీ విశ్వాసంతో ప్రజలు వేసుకుంటున్నారని తెలిపారు. అస్తమా, శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్తులు ఈ ఫిష్ మెడిసిన్ వేసుకుంటారని, వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ చేప ప్రసాదం కోసం ప్రజలు వస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేప ప్రసాదం కోసం చేపలు ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మెట్టు సాయికుమార్ , బత్తిని కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed