Congress MP: భవిష్యత్‌కు సీఎం రేవంత్ బంగారు బాటలు

by Gantepaka Srikanth |
Congress MP: భవిష్యత్‌కు సీఎం రేవంత్ బంగారు బాటలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ప్రజల సమస్యలకు హైడ్రా శాశ్వత పరిష్కారం అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రాకు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని అన్నారు. చెరువుల పరిరక్షణతో కొందరికి నష్టం జరుగొచ్చు.. కానీ శాశ్వత లాభం తప్పకుండా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ భవిష్యత్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంగారు బాటలు వేస్తున్నారని అన్నారు. దోమల బెడద నివారణకే మూసీ ప్రక్షాళన చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, తెలంగాణలో హైడ్రా ప్రకంపనలు కొనసాగుతున్నాయి.. జూన్ 27నుంచి తెలంగాణలో హైడ్రా సంస్థ ఆక్రమణల తొలగింపు చేపట్టింది. ఇప్పటిదాకా 43 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఆపరేషన్‌లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

Advertisement

Next Story