suicide : కడుపు నొప్పి భరించలేక వ్యక్తి మృతి

by Naveena |
suicide : కడుపు నొప్పి భరించలేక వ్యక్తి మృతి
X

దిశ,ఎల్లారెడ్డి:కడుపునొప్పి భరించలేక యువకుడు ఉరేసుకొని మృతి చెందాడు.ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం..నిజాంసాగర్ మండలం నర్వ గ్రామానికి చెందిన నీరుడు సతీష్ గత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. సతీష్ తన భార్య పిల్లలతో పాటుగా.. ఈ నెల 27 వ తేదీన ఎల్లారెడ్డి మండలం దావల్ మల్కాపల్లి గ్రామం లోని తన అత్తగారింటికి వచ్చారు. అక్కడ రాత్రి తిని పడుకున్న తర్వాత ఉదయం సతీష్ భార్య పుష్ప లేచి చూసేసరికి తన భర్త కనిపించకపోవడంతో.. గ్రామంలో చుట్టుపక్కల వెతికి చూడగా చింత చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. దీంతో మృతుడి తండ్రి ఫిర్యాదు చేయగా..ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేస్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed