Tirupati laddu : లడ్డూ వివాదంపై హిమాయత్ నగర్ టీటీడీలో వీహెచ్ దీక్ష

by Ramesh N |
Tirupati laddu : లడ్డూ వివాదంపై హిమాయత్ నగర్ టీటీడీలో వీహెచ్ దీక్ష
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. తెలంగాణలోనూ తిరుపతి లడ్డూపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఏకంగా దీక్షకు దిగారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి హిమాయత్ నగర్ టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద వీహెచ్ దీక్షను ప్రారంభించారు.

తిరుమలలో పవిత్రమైన శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందన్న ప్రచారంపై సమగ్ర విచారణ కోసం సీబీఐ విచారణ జరగాలని డిమాండ్‌తో వీహెచ్ దీక్ష‌కు కూర్చున్నారు. కాగా, తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తున్నారని, నాణ్యత రహితమైన వస్తువులను వినియోగించారని ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు.

Next Story

Most Viewed