మొత్తం ఆరు కుట్లు పడ్డాయ్: కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్

by Gantepaka Srikanth |
మొత్తం ఆరు కుట్లు పడ్డాయ్: కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసిఫ్‌నగర్‌లో ఇష్టానుసారం రోడ్లు తవ్వారని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్(Congress leader Feroze Khan) ఆరోపించారు. సోమవారం నాంపల్లి నియోజకవర్గంలోని ఆసిఫ్‌నగర్‌లో రోడ్ల పరిశీలనకు ఫిరోజ్ ఖాన్ వెళ్లారు. ఈ క్రమంలో స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అనుచరులు ఆయన్ను అడ్డుకొని దాడి చేశారు. అనంతరం ఫిరోజ్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. ‘ఆసిఫ్‌నగర్‌లో రోడ్లు గుంతలమయం అయ్యాయి. ఆ గుంతల్లో పడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతనికి ఆరు కుట్లు కూడా పడ్డాయి. ఈ విషయం తెలిసి పరామర్శించడానికి అక్కడకు వెళ్లాను. ఇంతలో ఎంఐఎం నేతలు నాపై దాడి చేశారు. ఈ దాడి ఘటనపై ఇప్పటికే స్థానిక పోలీసులకు కంప్లైంట్ చేశాను. ఎంఐఎం ఎమ్మెల్యే ఇలాఖాలో పర్యటించడం నేరమా?’ అని ఫిరోజ్ ఖాన్ ప్రశ్నించారు.

Advertisement

Next Story