- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ఎట్టకేలకు నేరవేరిన DS చివరి కోరిక.. సంతృప్తి వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఫ్రెండ్స్..!
![ఎట్టకేలకు నేరవేరిన DS చివరి కోరిక.. సంతృప్తి వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఫ్రెండ్స్..! ఎట్టకేలకు నేరవేరిన DS చివరి కోరిక.. సంతృప్తి వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఫ్రెండ్స్..!](https://www.dishadaily.com/h-upload/2024/06/29/347264-batti.webp)
దిశ, వెబ్డెస్క్: మాజీ మంత్రి, ఉమ్మడి ఏపీ మాజీ పీసీసీ చీఫ్ డీ శ్రీనివాస్ చివరి కోరిక నెరవేరింది. గుండె పోటుతో మరణించిన డీఎస్ పార్థివ దేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి ఆయన చివరి కోరికను టీపీసీసీ నేతలు తీర్చారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ హైదరాబాద్లోని డీఎస్ నివాసానికి వెళ్లి పార్టీ సంద్రాయం ప్రకారం కాంగ్రెస్ జెండాను డీఎస్ పార్థివ దేహంపై కప్పి నివాళులు అర్పించారు. డీఎస్ పార్థివ దేహంపై కాంగ్రెస్ కండువా కప్పగానే డీఎస్ చివరి కోరిక తీరిందని ఆయన స్నేహితులు, అభిమానులు, కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి విశిష్ట సేవలు అందించిన డీఎస్.. తాను చనిపోతే తన పార్థివ దేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలని ఎన్నోసార్లు అనేవారు. ఈ నేపథ్యంలో ఇవాళ హస్తం పార్టీ నేతలు డీఎస్ భౌతికాయంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి గౌరవించడంతో ఎట్టకేలకు డీఎస్ చిరకాల వాంఛ తీరిందని ఆయన స్నేహితులు, అభిమానులు, కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి డీఎస్ భౌతికాయాన్ని నిజామాబాద్కు తరలిస్తున్నారు. స్వస్థలంలో అధికారిక లాంఛనాల నడుమ ఆదివారం డీఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి.