రేపు నల్లమల్ల లో పర్యటించనున్న మంత్రి సీతక్క

by Kalyani |
రేపు నల్లమల్ల లో పర్యటించనున్న మంత్రి సీతక్క
X

దిశ, అచ్చంపేట : మంగళవారం నల్లమల్లలోని అచ్చంపేట నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పర్యటిస్తున్నట్టు మంత్రి కార్యాలయం నుండి షెడ్యూల్ సోమవారం విడుదల చేశారు. మంగళవారం ఉదయం మంత్రి కార్యాలయం నుండి ఉదయం 8 గంటలకు బయలుదేరి 10 గంటలకు అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామ శాఖ విశ్రాంతి భవనానికి చేరుకుంటారు.

అక్కడ అల్పాహారం అనంతరం 10:30 గంటలకు మండలంలోని ఎల్లంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ భవనాన్ని ప్రారంభించి అనంతరం తెలుగు పల్లి గ్రామంలో జిపి భవనానికి భూమి పూజ, ఎలుమ పల్లి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ భవనం, అమ్రాబాద్ మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల ప్రహరీ గోడ, రాయల గండి ఆలయానికి సంబంధించిన రోడ్డు తదితర అభివృద్ధి పనులకు భూమి పూజ వీటితో పాటు అచ్చంపేట, ఉప్పునుంతల తదితర మండలాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అచ్చంపేట పట్టణంలో మహిళా సంఘాల వారితో సమావేశం నిర్వహించి తదుపరి హైదరాబాద్ వెళ్లనున్నారు.

Next Story