రామోజీ అంత్యక్రియలకు సీఎం రేవంత్.. ఢిల్లీ నుంచి రాగానే హాజరయ్యేలా ఏర్పాట్లు..!

by Satheesh |
రామోజీ అంత్యక్రియలకు సీఎం రేవంత్.. ఢిల్లీ నుంచి రాగానే హాజరయ్యేలా ఏర్పాట్లు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. పార్టీ సమావేశాల నిమిత్తం రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న ఆయన హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత రామోజీ రావు అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. రామోజీరావు మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలిపిన సీఎం రేవంత్.. అధికారిక లాంఛనాలతో జరిపించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం 9.30 తర్వాత జరగనున్నట్లు రామోజీ ఫిలిం సిటీ నుంచి ప్రకటన వెలువడడంతో ఉదయం ఢిల్లీ నుంచి రాగానే నేరుగా వెళ్ళి ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించనున్నారు. అంత్యక్రియల్లోనూ పాల్గొనే అవకాశమున్నది. కాంగ్రెస్ ఎంపీలతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ పార్లమెంటరీ చైర్‌‌పర్సన్ సోనియాగాంధీ సమావేశం ఉన్నందున శనివారం రాత్రి వరకూ సీఎం రేవంత్ ఢిల్లీలోనే ఉండిపోయారు.

Advertisement

Next Story