ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి

by Satheesh |
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఎమ్మెల్యే సత్యం ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే సత్యాన్ని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా, రెండు రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో ఎమ్మెల్యే సత్యం భార్య రూపాదేవి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బిజీ షెడ్యూల్ వల్ల రూపాదేవి అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్యే సత్యం ఇంటికి వెళ్లి రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement

Next Story

Most Viewed