భారతీయుడు -2 యూనిట్‌పై హర్షం వ్యక్తం చేసిన సీఎం రెవంత్ రెడ్డి.. కారణం ఇదే..!

by Indraja |   ( Updated:2024-07-09 08:03:26.0  )
భారతీయుడు -2 యూనిట్‌పై హర్షం వ్యక్తం చేసిన  సీఎం రెవంత్ రెడ్డి.. కారణం ఇదే..!
X

దిశ వెబ్ డెస్క్: భారతీయుడు -2 సినిమా యూనిట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పంధించారు. వివరాల్లోకి వెళ్తే.. డ్రగ్స్ నియంత్రణపై ప్రముఖ హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్, సిద్దార్థ, సముద్రఖని కలిసి అవగాహణ వీడియో చేశారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా భారతీయుడు -2 సినిమా బృందానికి అభినందనలు తెలిపారు.

‘డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా కమల్ హాసన, శంకర, సిద్దార్థ, సముద్రఖని కలిసి ఈ అవగాహనా వీడియో రూపొందించడం హర్షించదగ్గ విషయం.’ అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామాండ్ కంట్రల్ క్యార్యాలయంలో నూతన వాహనాలను ప్రారంభించిన విషయం అందిరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం డ్రగ్స్‌ మహంమారి మత్తులో ప్రజలను ముఖ్యంగా యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సైబర్ నేరాలు అని తెలిపారు. కాగా ఈ డ్రగ్స్‌ వినియోగాన్ని నియంత్రిచడంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, కాగా సీనిమా రంగం సైతం డ్రగ్స్ మహంమ్మారిని మట్టుపెట్టేలా చలనచిత్ర నటీనటులను 1, 2 నిమిషాల అవగాహణ వీడియో చేసి, ప్రభుత్వానికి పంపమన్న విషయం అందరికీ తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed