రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. మొదటి రెండు రోజులు కొత్తగా ఎంపికైన లోక్ సభ సభ్యుల ప్రమాణ స్వీకారం కొనసాగనున్నది. ఈ కార్యక్రమానికి సీఎం హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్రాభివృద్ధిపై చర్చించి పలు సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఏఐసీసీ పెద్దలతోనూ భేటీ అయి కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై పార్టీ పెద్దలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పార్టీలో పదవులు ఆశిస్తున్న ఆశావాహుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed