ఎస్ బీఐ ఎండీ గా పాలమూరు బిడ్డ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

by prasad |
ఎస్ బీఐ ఎండీ గా పాలమూరు బిడ్డ..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత బ్యాంకింగ్ సెక్టార్ లో దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నూతన చైర్మన్ గా తెలంగాణ బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టి నియమితులు కాబోతున్నారు. ఈ మేరకు శ్రీనివాసులు శెట్టి పేరును ఎఫ్ఎస్ఐబి సిఫార్సు చేసింది. ఈ సందర్భంగా శ్రీనివాసులు శెట్టికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. జోగుళాంబ గద్వాల్ జిల్లాకు చెందిన శ్రీనివాసులు ప్రతిష్టాత్మకమైన ఎస్ బీఐ చైర్మన్ పదవిని అధిరోహించబోతుండటం ఒక మహత్తర సందర్భం అని సీఎం అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం సీఎంవో ట్వీట్ చేసింది. భారత దేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుకు నూతన చైర్మన్ గా నియమితులు కాబోతున్నందున తెలంగాణ రాష్ట్రం తరపున ముఖ్యమంత్రి అభినందలు తెలిపారు. ఈ కొత్త బాధ్యతల్లో మరెన్నో విజయాలు, ప్రశంసలు అందుకోవాలని ఆంక్షించారు. అలాగే శ్రీనివాస్ శెట్టికి వివిధ పార్టీల నేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఎక్స్ వేదికగా విష్ చేశారు. కాగా ప్రస్తుతం ఎస్ బీఐ మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేస్తున్న శ్రీనివాసులు శెట్టి చైర్మన్ గా ఆగస్టులో బాధ్యతలు స్వీకరిస్తారు.

Next Story

Most Viewed