గత ప్రభుత్వం వల్లే గల్లీ గల్లీలో గంజాయి దొరుకుతుంది: సీఎం రేవంత్ రెడ్డి

by Mahesh |
గత ప్రభుత్వం వల్లే గల్లీ గల్లీలో గంజాయి దొరుకుతుంది: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంజాయి, డ్రగ్స్ వినియోగం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ ఆఫీస్ లో పోలీసులకు సంబంధించిన కొత్త వాహనాలను సీఎం జెండా ఊపీ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో, నగరంలో భారీ ఎత్తున గంజాయి అందుబాటులో ఉందని.. దానిని అరికట్టడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరం ముందుకు సాగుతున్నామని అన్నారు. అలాగే గత ప్రభుత్వం పనితీరు వలన తెలంగాణ రాష్ట్రంలోని గల్లీ గల్లీలో గంజాయి అందుబాటులో ఉందని, దానిని అరికట్టడం ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి సవాల్ గా మారిందని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికి రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో గంజాయి స్మగ్లర్లు, అమ్మకం దారులు, వినియోగదారుల పై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

Next Story

Most Viewed