CM Revanth : ముఖ్య‌మంత్రికి రాఖీ క‌ట్టిన చిన్నారులు.. ఇంతకి వారు ఎవరంటే?

by Ramesh N |   ( Updated:2024-08-19 13:31:06.0  )
CM Revanth : ముఖ్య‌మంత్రికి రాఖీ క‌ట్టిన చిన్నారులు.. ఇంతకి  వారు ఎవరంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: వినికిడి స‌మ‌స్యతో బాధ‌ప‌డుతూ ప్ర‌భుత్వ స‌హాయంతో శ‌స్త్రచికిత్స చేయించుకున్న ప‌లువురు చిన్నారులు సీఎం రేవంత్ రెడ్డికి సోమ‌వారం రాఖీలు క‌ట్టి త‌మ అభిమానం చాటుకున్నారు. వినికిడి సమస్య ఉన్న అయిదేళ్లలోపు పిల్లలకు స‌ర్జ‌రీలు చేస్తే స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంది. ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత వినికిడి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న చిన్నారుల వైద్యానికి అవ‌స‌ర‌మైన స‌హాయాన్ని వేగంగా అందిస్తున్నారు. దీంతో హైద‌రాబాద్ కోటిలోని ఈఎన్‌టీ ఆసుప‌త్రిలో కోక్లియర్ ఇంప్లాంట్ స‌ర్జ‌రీలు జ‌ర‌గుతున్నాయి.

ఖ‌రీదైన వినికిడి యంత్రాలు, స‌ర్జ‌రీలు చేయించుకున్న‌వారికి ఎల్‌వోసీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్ర‌భుత్వం అండ‌గా నిలిస్తోంది. చికిత్స‌ల అనంత‌రం ఉచితంగా వినికిడి యంత్రాల‌తో పాటు ఏడాది పాటు ఏవీటీ ( ఆడిషన్స్ వెర్బల్ థెరపీ) అందిస్తారు. ఇటీవ‌ల ఈ స‌ర్జ‌రీలు చేయించుకున్న ప‌లువురు చిన్నారులు ఈఎన్‌టీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆనంద్ ఆచార్య, వైద్యురాలు డీకే వీణ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం స‌చివాల‌యానికి వ‌చ్చి సీఎం రేవంత్ రెడ్డికి రాఖీలు క‌ట్టి త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. త‌మ పిల్ల‌ల‌కు శ‌స్త్రచికిత్స‌లు చేయించినందుకు వారి కుటుంబ స‌భ్యులు ముఖ్య‌మంత్రికి ఈ సందర్భంగా కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

Advertisement

Next Story