అమ్మాయిలతో వలపు వల వేయిస్తూ ఘరానా మోసం.. మోష్ పబ్‌పై కేసు నమోదు

by Rajesh |
అమ్మాయిలతో వలపు వల వేయిస్తూ ఘరానా మోసం.. మోష్ పబ్‌పై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: డేటింగ్ యాప్ ముసుగులో అమ్మాయిలతో అబ్బాయిలకు వల వేయడం.. తద్వారా యువకులను నిలువు దోపిడి చేయడం ఇది ఇటీవల బయటపడ్డ మోష్ పబ్ నిర్వాకం.. కాగా తాజాగా మోష్ పబ్‌పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోష్ పబ్ యాజమాన్యం డేటింగ్ యాప్‌లతో అమ్మాయిలను ఎరవేసి వినియోగదారులకు ఖరీదైన మద్యం తాగించి భారీ మొత్తంలో లూటీ చేస్తున్నారు. అయితే ఇటీవల ఓ యువకుడు ఇదే తరహాలో మోసపోవడంతో ఈ కొత్త రకం ఫ్రాడ్ వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు మోష్ పబ్‌పై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed