‘రక్షించండి’.. గవర్నర్‌కు BRS నేత దాసోజు శ్రవణ్ కీలక లేఖ

by Satheesh |
‘రక్షించండి’.. గవర్నర్‌కు BRS నేత దాసోజు శ్రవణ్ కీలక లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కీలక లేఖ రాశారు. రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నేతలు, జర్నలిస్టులపై పోలీసులు దాడులు చేస్తు్న్నారని లేఖ ద్వారా గవర్నర్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను రక్షించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రిపేర్ అయ్యేందుకు తగిన సమయం లేదని గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. పలు చోట్ల నిరుద్యోగుల ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టులు చేస్తున్నారు. నిరుద్యోగుల ఆందోళనలను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేత దాసోజు గవర్నర్‌కు కంప్లైంట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed