ప్రజల కళ్ళల్లో రక్తాన్ని చూస్తుండు.. ‘హైడ్రా’ కూల్చివేతలపై దాసోజు శ్రవణ్ ఫైర్

by Ramesh N |
ప్రజల కళ్ళల్లో రక్తాన్ని చూస్తుండు.. ‘హైడ్రా’ కూల్చివేతలపై దాసోజు శ్రవణ్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆదివారం కూకట్‌పల్లి నల్లచెరువులోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ పరిధిలోని పటేల్‌గూడ గ్రామంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. దీంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ప్రజాస్వామిక రాష్ట్రం రాజ్యాంగ బద్దంగా పనిచేయాలన్నారు. కానీ ముఖ్యమంత్రి తన నిరంకుశత్వంతో మూర్ఖత్వంతో కురచ మనస్తత్వంతో నిస్సహాయులైన ప్రజల కళ్ళల్లో రక్తాన్ని చూస్తుండని విమర్శించారు.

ప్రజల కష్టాలు కడతేర్చమని అధికారమిస్తే, కన్నీళ్లు పెట్టిస్తున్న రేవంత్ ప్రభుత్వ వైఖరి ముమ్మాటికీ రాక్షసత్వమే అని పేర్కొన్నారు. దురదృష్టం, వాళ్ళ వాళ్ళ అధికారం కోసం, ప్రాబల్యం కోసం ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మలుగా మారి ఆయన చేపడుతున్న రాజ్యాంగ వ్యతిరేక ప్రజావ్యతిరేక విద్వంసకర చర్యలకు హైడ్రా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.

Next Story

Most Viewed