BREAKING: ఇరు రాష్ట్రాల సీఎంల చర్చలు సఫలం కావాలి: ఎంపీ రఘునందన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |
BREAKING: ఇరు రాష్ట్రాల సీఎంల చర్చలు సఫలం కావాలి: ఎంపీ రఘునందన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం భేటీ కాబోతున్నారు. అయితే ఆ భేటీపై ఎంపీ రఘునందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్నేహపూర్వక వాతావరణంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ సఫలం కావాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గతంలో ఇద్దరు నేతలు కలిసి ఒకటే పార్టీలో పని చేశారని, వారి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండొచ్చని అన్నారు. భేటీలో ముఖ్యంగా న్యాయపరమైన ఆస్తుల విషయంల సుధీర్ఘ చర్చలు జరిపి వాటిని పరిష్కరించుకోవాలని అన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల సీఎంలు చొరవచూపాలంటూ రఘునందన్ కామెంట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed