శంషాబాద్‌లో దారుణం.. కన్న తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

by Kavitha |
శంషాబాద్‌లో దారుణం.. కన్న తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు
X

దిశ శంషాబాద్ : కుటుంబ కలహాలతో కన్నతండ్రినే కన్న కొడుకు అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రనగర్ దొడ్డిలో చోటుచేసుకుంది. శంషాబాద్ సిఐ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రనగర్ దొడ్డి కాలనీలో వ్యక్తిని హత్య చేశారని సమాచారం రావడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతి చెందిన వ్యక్తి ఆకుల రాములు (55)గా గుర్తించారు. అక్కడే ఉన్న కావలి గౌరమ్మను విచారించగా.. శుక్రవారం రాత్రి ఆకుల రాములు అతని కొడుకు ఆకుల శివ కుమార్ ఇద్దరూ పరస్పరం గొడవపడ్డారని దాని కారణంగానే తండ్రిపై కొడుకు ఆకుల శివ కుమార్ గొడ్డలితో కొట్టి చంపాడు అని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed