- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Bomb Threat: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. సీఐఎస్ఎఫ్ విస్తృత తనిఖీలు
X
దిశ, వెబ్డెస్క్: విమానంలో బాంబు పెట్టానంటూ ఓ ప్రయాణికుడు కలకలం రేపిన ఘటన ఢిల్లీ ఎయిర్పోర్టులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్లే ఎయిరిండియా విమానం మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఓ ప్రయాణికుడు ఎయిర్పోర్టుకు సరైన సమయంలో అందుకోకపోవడంతో ఫ్లైట్ మిస్ అవ్వకుండా అందులో బాంబు ఉందని కాల్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్, బాంబ్ స్క్వాడ్ విమానంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని నిర్ధారించారు. అదేవిధంగా కావాలని తప్పుడు సమాచారం ఇచ్చిన ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story