బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి డెట్ ఫిక్స్..

by Vinod kumar |
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి డెట్ ఫిక్స్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ఈనెల 22వ తేదీన నిర్వహించనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇన్ చార్జీ, జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ జీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ఇన్ చార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, రాష్ట్ర సహ ఇన్ చార్జీ అరవింద్ మీనన్ హాజరుకానున్నారు.

పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ జాతీయ నాయకులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర పదాధికారులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ చార్జీలు పాల్గొనాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాల అనంతరం ఈనెల 23, 24 తేదీల్లో జిల్లా కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నారు. అవి ముగిసిన అనంతరం ఈనెల 25, 26 తేదీల్లో మండల కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు.

Advertisement

Next Story