పార్టీ ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకం: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Gantepaka Srikanth |
పార్టీ ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకం: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కుటుంబ పార్టీలు అని వెల్లడించారు. అలాంటి ఫిరాయింపులను తాము సమర్థించబోమని స్పష్టం చేశారు. పార్టీలు మారడం కాంగ్రెస్, బీఆర్ఎస్‌ నేతలకు అలవాటే అని అన్నారు. అన్ని పార్టీలు రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించారు. కాగా, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ పార్టీ నేతలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం తీర్పు వెలువరించింది. ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed