- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
సీఎంకు ధమ్కీ ఇవ్వడానికి ఎంఐఎం నేతలెవరు?.. వారికి నేను ధమ్కీ ఇస్తున్నా..
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధమ్కీ ఇవ్వడానికి ఎంఐఎం నేతలు ఎవరని బీజేపీ కీలక నేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రి ఒక పని చేస్తుంటే అడ్డుకుంటున్న ఎంఐఎం నేతలకు ఎందుకంత బలుపని ఆమె మండిపడ్డారు. ఎంఐఎం అంటే అందరూ భయపడుతారేమోనని కానీ తాను భయపడబోనని నొక్కి చెప్పారు. ఎంఐఎంకు ఖబడ్దార్ అంటూ ధమ్కీ ఇస్తున్నట్లు మాధవీలత చెప్పారు. హైదరాబాద్లోని విరించి ఆస్పత్రిలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సంతోశ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న దేవాలయంలో పలువురు విగ్రహాలు ధ్వంసం చేశారని, దానికి తాము రామనమం జపిస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసినందుకు తనపై కేసు పెట్టారన్నారు.
దీనికి కారణం ఫాతిమా కాలేజీ అంశమేనని ఆమె పేర్కొన్నారు. హిందువులు శాంతియుతంగా ఉండటం ఎంఐఎం నేతలకు ఇష్టం లేదని ఆమె ఫైరయ్యారు. కబ్జాల నుంచి చెరువులను రక్షిస్తుంటే రేవంత్ రెడ్డిని అడ్డుకునేందుకు ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఫైరయ్యారు. బీఆర్ఎస్ ను లొంగ తీసుకున్నట్లే రేవంత్ ను కూడా లొంగదీసుకోవాలని చూస్తున్నారని మాధవీలత పేర్కొన్నారు. వినాయక చవితి సందర్భంగా నగరంలో ఏమైనా అల్లర్లు చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ముస్లిం ప్రజలు ఇకనైనా మేల్కోవాలని, వక్ఫ్ బోర్డు భూములు కబ్జా చేస్తున్నది ఎవరూ తెలుసుకోవాలని మాధవీలత సూచించారు.