Group 1 Mains Exam : గ్రూప్ -1 పరీక్ష సెంటర్ వద్ద బయో టాయిలెట్ బస్సు బీభత్సం!

by Ramesh N |   ( Updated:2024-10-21 10:40:09.0  )
Group 1 Mains Exam : గ్రూప్ -1 పరీక్ష సెంటర్ వద్ద బయో టాయిలెట్ బస్సు బీభత్సం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని నాంపల్లిలో బయో టాయిలెట్ బస్సు బీభత్సం సృష్టించింది. గ్రూప్ 1 పరీక్షల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో అభ్యర్థుల కోసం బయో టాయిలెట్ బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ కళాశాల వద్ద పరీక్ష రాయడానికి వచ్చే విద్యార్థుల కోసం బయో టాయిలెట్ బస్సును ఏర్పాటు చేశారు. డ్రైవర్ అజాగ్రత్తతో బస్సు నడపడం వల్ల కాలేజీ గోడ, గేటు ధ్వంసం అయింది. దీంతో పోలీసులు గేటు పక్కకు పెట్టారు. అయితే, ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

తెలంగాణలో భారీ బందోబస్తు నడుమ గ్రూప్ 1 పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను అధికారులు మూసివేశారు. సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. నిమిషం నిబంధన ఉండటంతో ఆలస్యంగా వచ్చిన వారిని అధికారులు లోపలికి అనుమతించలేదు. వివిధ కేంద్రాల్లో ఆలస్యంగా వచ్చిన పలువురు అభ్యర్థులు గేటు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ అధికారులను వేడుకున్నారు. ఇక తొలిరోజు జనరల్ ఇంగ్లీష్ పేపర్ పరీక్ష నిర్వహించారు. ఈ నెల 27 వరకు వివిధ సబ్జెక్టుల ప్రకారం పరీక్షలు జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed