Bandi Sanjay : కార్గిల్ యుద్ధ వీరులను స్మరిస్తూ బండి సంజయ్ ట్వీట్

by Aamani |
Bandi Sanjay : కార్గిల్ యుద్ధ వీరులను స్మరిస్తూ బండి సంజయ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్ : భారతదేశ శౌర్య పరాక్రమాలకు పట్టం కట్టిన వీర సైనికుల ధైర్య సాహసాలకు ప్రతిరూపం కార్గిల్ యుద్ధం అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కార్గిల్‌ 25వ విజయ దివస్‌ సందర్భంగా శుక్రవారం అమర జవానులకు నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. ప్రాణాలకు తెగించి పాకిస్తాన్ సైనికులను నిలువరించిన వీర జవానుల త్యాగం అజరామరం, అనన్య సామాన్యం, అనితర సాధ్యం అని అన్నారు. అంతే కాకుండా ఆనాటి వీర సైనికుల స్ఫూర్తి, నేటి తరానికి వెలుగుల దారిని చూపే దీప్తీయై నడిపిస్తున్న ఆ వీరోచిత ఘట్టాలను నిత్యం స్మరించుకుంటూ.. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు “ కార్గిల్ విజయ్ దివస్ “ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను అని ట్విట్టర్ వేదికగా తెలిపారు.



Next Story