KTR బహిరంగ లేఖకు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్

by Rajesh |
KTR బహిరంగ లేఖకు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన బహిరంగ లేఖకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ గారు నేతన్నలు ఇన్నాళ్లకు గుర్తొచ్చారా? అని ప్రశ్నించారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది మీరే కదా అని ఫైర్ అయ్యారు. సిరిసిల్లకు 15 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా అని తెలిపారు. మీ పాలన నుంచే నేతన్నల ఆకలి చావులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. మీరెందుకు నేతన్నలను సంక్షోభం నుంచి గట్టెక్కించలేకపోయారు అని ప్రశ్నించారు. పవర్ లూమ్ సంస్థలు మూతపడేలా చేసింది మీరే కదా అని ఆరోపించారు. ప్రధాని మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రకటించినప్పుడు సిరిసిల్ల గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. నేతన్నలను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా అన్నారు. కరీంనగర్ ఎంపీగా నా బాధ్యత కూడా అదే అన్నారు.

Advertisement

Next Story

Most Viewed