‘మనం కూడా మోడీ బాటలోనే నడుద్దాం’.. బండి సంజయ్‌కి కేటీఆర్ కౌంటర్

by Gantepaka Srikanth |
‘మనం కూడా మోడీ బాటలోనే నడుద్దాం’.. బండి సంజయ్‌కి కేటీఆర్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌(Bandi Sanjay)కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ నోటీసులు ఇస్తే ఎదుర్కొంటా అని ప్రకటించారు. ఉడత ఊపులకు భయపడబోనని బండి సంజయ్ అంటున్నారు. మరి రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ ఎందుకు లీగల్ నోటీసులు ఇచ్చారో సమాధానం చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. నోటీసుల విషయంలో ప్రధాని మోడీ(PM MODI) బాటలోనే మనం కూడా నడుద్దామని కేటీఆర్ సూచించారు. అంతకుముందు బండి సంజయ్‌కి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తన పరువుకు భంగం కలిగించేలా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు.

వారం రోజుల్లోగా తనకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని.. లేదంటే న్యాయపరమైన చర్యలు తప్పవని బండి సంజయ్‌ను కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు లీగల్ నోటీసులు పంపించారు. ఇదిలా ఉండగా.. కేటీఆర్ పంపిన లీగల్ నోటీసు(Legal Notices)లపై ఇప్పటికే బండి సంజయ్‌ సైతం స్పందించారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని అన్నారు. ముందు కేటీఆర్ నా మీద చేసిన వ్యాఖ్యలకు స్పందనగానే తానూ మాట్లాడానని అన్నారు. ‘లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తా’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు. తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా కేటీఆర్ స్పందించి మోడీ బాటలో నడుద్దామని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed