KTR : బాబు చిట్టి.. ఎక్స్‌లో మాజీ మంత్రి కేటీఆర్ సెటైరికల్ పోస్ట్ ఇదే!

by Ramesh N |
KTR : బాబు చిట్టి.. ఎక్స్‌లో మాజీ మంత్రి కేటీఆర్ సెటైరికల్ పోస్ట్ ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో ఒకే నెలలో 48 మంది శిశువులు, 14 మంది బాలింత తల్లులు మృత్యువాత పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. స‌ర్కారు ఈ లెక్క‌ల‌ను ఎందుకు దాస్తోందని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. ‘బాబు చిట్టి, రాహుల్ గాంధీ బొమ్మకు ఢిల్లీలో మార్కులు పడ్డాయిగా, ఇక గాంధీ హాస్పిటల్‌లో చనిపోతున్న పిల్లలు, ఆడబిడ్డల మీద దృష్టి పెట్టు’ అంటూ ఒక ఫోటో షేర్ చేస్తూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

కాగా, ఈ గాంధీ దవాఖానలో శిశువులు, బాలింత మరణాల విషయమై హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ నిన్న స్పందించారు. ప్రభుత్వ దవాఖానను నాశనం చేసే కుట్రలు ఇకనైన బంద్ చేస్తే బెటర్ అంటూ మంత్రి దామోదర రాజనర్సింహా నిన్న కేటీఆర్‌కు హర్నింగ్ ఇచ్చారు. గాంధీ హాస్పిటల్‌పై బురద జల్లి, ఇక్కడికి ట్రీట్‌మెంట్ కోసం వచ్చే నిరుపేదల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారన్నారు. దేశంలోని ఏ టెర్షియరీ కేర్ హాట్పిటల్‌లోనైనా, ప్రతి నెల పదుల సంఖ్యలో మరణాలు జరుగుతుంటాయని క్లారిటీ ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే మరణాలు జరిగాయంటూ కేటీఆర్ నంబర్లను భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నాడని తాజాగా ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed