ఈనెల 28న హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక

by Y. Venkata Narasimha Reddy |
ఈనెల 28న హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 28న హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్రపతి ముర్ము ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 11:50గంటలకు హకీంపేట్ ఎయిర్‌ఫోర్టు కు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 12:20కి నల్సర్ యూనివర్సిటీలో జరిగే యూనివర్సిటీ 21వ కాన్వకేషన్ కు ముఖ్య అతిధిగా హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3:30కు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు ముర్ము చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన భారతీయ కళామహోత్సవం 2024ను ప్రారంభిస్తారు. సాయంత్రం 5:45కు హకీంపేట్ ఎయిర్‌ఫోర్టు కు చేరుకుని తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సెక్రటేరియట్ లో సీఎస్ అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. పర్యటనకు సంబంధించి ప్రోటోకాల్‌ విభాగం ఏర్పాట్లు చేయనుండగా, రాష్ట్ర, కెేంద్ర బలగాలు పర్యవేక్షణ, భద్రత చర్యల్లో పాల్గొంటాయి.

Next Story

Most Viewed