తెలంగాణలోని పది వర్శిటీలకు ఇన్‌చార్జి వీసీలు

by GSrikanth |
తెలంగాణలోని పది వర్శిటీలకు ఇన్‌చార్జి వీసీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు ఇన్‌చార్జి వైస్ చాన్సెలర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న వీసీల పదవీకాలం పూర్తికావడంతో ఇన్‌చార్జిలుగా ఐఏఎస్ అధికారులను అపాయింట్ చేసింది. కొత్త వీసీలు నియమితులయ్యేంత వరకూ వీరే బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఇప్పటికే కొత్త వీసీల కోసం అన్ని వర్శిటీలలో సెర్చ్ కమిటీలు ఏర్పాటయ్యాయి. జాబితాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నది. ప్రస్తుతం ఇన్‌చార్జిలుగా వ్యవహరించే ఐఏఎస్ అధికారులు, ఆయా యూనివర్శిటీల వివరాలు :

ఉస్మానియా : దాన కిషోర్

జేఎన్టీయూ : బుర్రా వెంకటేశం

కాకతీయ : వాకాటి కరుణ

అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ : రిజ్వి

తెలంగాణ వర్సిటీ : సందీప్ కుమార్ సుల్తానియా

పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ : శైలజా రామయ్యర్

మహాత్మాగాంధీ వర్సిటీ : నవీన్ మిట్టల్

శాతవాహన వర్సిటీ : సురేంద్రమోహన్

జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ : జయేష్ రంజన్

పాలమూరు యూనివర్సిటీ : నదీం అహ్మద్

Advertisement

Next Story

Most Viewed