Atrocious: కరీంనగర్‌లో విషాధం.. యువతి ప్రాణం తీసిన ఇంటర్ ఫలితాలు..

by Indraja |
Atrocious: కరీంనగర్‌లో విషాధం.. యువతి ప్రాణం తీసిన ఇంటర్ ఫలితాలు..
X

దిశ వెబ్ డెస్క్: ఇటీవల తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫెయిల్ అయిన విద్యార్థులు పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్న వాళ్లకు కడుపుకోత మిగిల్చి శాశ్వతంగా కన్ను మూస్తున్నారు. ఈ కోవలోకి మరో యువతి చేరింది. 17 ఏళ్లకే జీవితాన్ని ముగించింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి గ్రామానికి చెందిన శ్యామల వైష్ణవి(17) అనే యువతి ఇంటర్ చదువుతోంది.

అయితే ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైందని. దీనితో . మనస్తాపం చెందిన ఆ యువతి ఈనెల 2వ తేది ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నంచింది. ఇది తెలుసుకున్న కుటుంబ సబ్యులు యువతిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందింది. దీనితో ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed