బ్రేకింగ్: తెలంగాణకు చేరుకున్న అమిత్ షా.. నేరుగా చేవేళ్లకు పయనం

by Satheesh |
బ్రేకింగ్: తెలంగాణకు చేరుకున్న అమిత్ షా.. నేరుగా చేవేళ్లకు పయనం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో విజయ సంకల్ప సభ పేరుతో టీ- బీజేపీ నిర్వహిస్తోన్న భారీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు వస్తోన్న కేంద్రమంత్రి అమిత్ షా రాష్ట్రానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు తెలంగాణ బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి అమిత్ షా నేరుగా చేవేళ్ల సభకు వెళ్లనున్నారు.

ఈ సభ అనంతరం తిరిగి ఆయన కర్ణాటక వెళ్లనున్నారు. ఇక, విజయ సంకల్ప సభలో పాల్గొన్నంటున్న అమిత్ షా స్పీచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌కు బీజేపీకి మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న తరుణంలో కేసీఆర్ ప్రభుత్వం అమిత్ షా విమర్శలు చేస్తారా.. లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

Next Story

Most Viewed