ఆదిలాబాద్ లో పెద్ద పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

by M.Rajitha |
ఆదిలాబాద్ లో పెద్ద పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. వజ్జర్ గ్రామ సమీపంలోని అతవిలో సంచరిస్తున్న పులిని చూసిన గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. అడవిలో పులి తిరుగుతుందనే వార్తా గుప్పుమనడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పులి సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు అక్కడికి చేరుకొని.. పరిశీలించారు. గ్రామస్తులు ఎవరూ అడవిలోకి వెళ్లొద్దని సూచనలు చేశారు. అయితే పులి సంచరిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed